4.3
Biographies
పతంజలిగా ప్రసిద్ధుడైన కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి పుట్టడం, పెరగడం, చదవడం, పాత్రికేయ వృత్తిలో కాలూనడం ఉత్తరాంధ్రలోనే జరిగింది. ప్రజాస్వామ్యానికి శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ, పత్రికా వ్యవస్థలని మూల స్తంభాలుగా చెబుతారు. తెలుగు రచయితలు చాలా మంది వీటిల్లో డొల్లతనాన్ని, అన్యాయాన్ని ఎత్తి చూపడానికి ఒకటో రెండో రంగాలు ఎంచుకొని రాసిన దాఖలాలు చాలా ఉన్నాయి. కాని పతంజలి మాత్రం ఈ నాలుగు స్తంభాలనీ ఏకరీతిలో ఎండగట్టి, చీల్చి చెండాడేరు. ఇలా మూలవ్యవస్థలన్నింటిపై ప్రత్యేకంగా రచనలు సాగించి రాజ్యాన్ని ఎండగట్టిన, నిలదీసిన తెలుగు రచయిత బహుశా ఈయనొక్కరే కనబడతారు. ఖాకీ వనం పోలీసుల జీవితాల ఆధారంగా రూపొందించబడింది.
© 2022 Storyside IN (Audiobook): 9789354831423
Release date
Audiobook: 15 April 2022